Tirumala: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం.. భక్తుల మినీ వ్యాను బోల్తా

తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. మల్వాడి గుండం వద్ద తమిళనాడు భక్తులకు చెందిన మినీ వ్యాన్‌ అదుపు తప్పి బోల్తా పడింది.

Published : 17 May 2024 15:58 IST

తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. మల్వాడి గుండం వద్ద తమిళనాడు భక్తులకు చెందిన మినీ వ్యాన్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న తితిదేకు చెందిన నీళ్ల ట్యాంకర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవరు వెంటనే బ్రేకులు వేయడంతో ట్యాంకర్ అదుపుతప్పకుండా జాగ్రత్తపడ్డాడు.

Tags :

మరిన్ని