Vijayawada: విజయవాడలో కలుషిత నీటికి మరొకరు బలి

విజయవాడ నగరంలో కలుషిత నీరుతో మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోవ్యక్తి మృతి చెందారు.

Published : 30 May 2024 10:01 IST

విజయవాడ నగరంలో కలుషిత నీరుతో మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోవ్యక్తి మృతి చెందారు. వారం వ్యవధిలోనే కలుషిత నీటిని తాగడం వల్ల మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీరంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం. సుమారు 150 మంది ఇప్పటి వరకు చికిత్స పొందగా.. మరికొంత మంది ఇంకా వైద్యం చేయించుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు మాత్రం వీరివి సహజ మరణాలుగా చిత్రీకరిస్తున్నాయి.  

Tags :

మరిన్ని