AP Elections 2024: ఏపీలో ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు: సీఈఓ ముకేశ్‌కుమార్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, రాత్రి 9 గంటల్లోపూ మొత్తం ప్రక్రియ ముగించి ఫలితాలు ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా వెల్లడించారు.

Updated : 30 May 2024 11:04 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, రాత్రి 9 గంటల్లోపూ మొత్తం ప్రక్రియ ముగించి ఫలితాలు ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా వెల్లడించారు. మొత్తం 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లలోపు లెక్కింపు పూర్తవుతుందని మరో 61 నియోజకవర్గాల్లో 24 రౌండ్లు ఉన్నాయన్నారు. కేవలం 3 నియోజకవర్గాల్లోనే 25 రౌండ్ల వరకూ లెక్కింపు కొనసాగుతుందని వెల్లడించారు. కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్‌ వ్యాస్‌ నిర్వహించిన సమీక్షలో సీఈవో సహా రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.  

Tags :

మరిన్ని