Bandi Sanjay: కాళేశ్వరం తర్వాత అతిపెద్ద స్కామ్‌ ఆ శాఖలోనే జరిగింది!: బండి సంజయ్‌

కాళేశ్వరం కుంభకోణం తర్వాత అతిపెద్ద స్కామ్‌.. పౌరసరఫరాల శాఖలోనే జరిగిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ (Bandi Sanjay) అన్నారు.

Published : 25 May 2024 13:29 IST

కాళేశ్వరం కుంభకోణం తర్వాత అతిపెద్ద స్కామ్‌ పౌరసరఫరాల శాఖలోనే జరిగిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ (Bandi Sanjay) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ శాఖలో జరిగిన అక్రమాలు, అవినీతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. నల్గొండ భాజపా జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రైస్‌ మిల్లర్ల నుంచి గతంలో నాయకులకు ముడుపులు ముట్టాయని ఆరోపించారు.

Tags :

మరిన్ని