Bhatti Vikramarka: తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్నీ కొంటాం: భట్టి విక్రమార్క

వర్షాలకు తడిచిన ధాన్యం కూడా కొంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

Updated : 21 May 2024 17:01 IST

తడిచిన, మొలకెత్తిన ధాన్యానికి కూడా ఎంఎస్‌పీ ఇచ్చి కొనుగోలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటన్నారు.

Tags :

మరిన్ని