Mukeshkumar Meena: ఓట్ల లెక్కింపు రోజు.. అలజడి సృష్టిస్తే అరెస్టు చేస్తాం: సీఈవో ముకేశ్‌కుమార్‌

ఏపీలో ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ కేంద్రంలో ఎవరైనా చిన్న అలజడి సృష్టించినా తక్షణమే వారిని అరెస్ట్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా (Mukesh kumar Meena) హెచ్చరించారు.

Published : 30 May 2024 15:41 IST

ఏపీలో ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ కేంద్రంలో ఎవరైనా చిన్న అలజడి సృష్టించినా తక్షణమే వారిని అరెస్ట్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా (Mukesh kumar Meena) హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు గమనించాలని సూచించారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సీఆర్పీఎఫ్‌ దళాలు భద్రతను పర్యవేక్షిస్తుంటాయని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు.

Tags :

మరిన్ని