Chandababu-Modi: మోదీ నేతృత్వంలో 2047నాటికి నెంబర్‌ వన్‌గా భారత్‌!: చంద్రబాబు

ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టేందుకు నరేంద్రమోదీ (Modi) రేయింబవళ్లు శ్రమించారని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) కొనియడారు.

Published : 07 Jun 2024 15:45 IST

ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టేందుకు నరేంద్రమోదీ (Modi) రేయింబవళ్లు శ్రమించారని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) కొనియడారు. ఆయన సారథ్యంలో దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతోందన్నారు. దూరదృష్టి కలిగిన మోదీ.. ఆర్థికవ్యవస్థను పరుగులు తీయించారని చంద్రబాబు ప్రశంసించారు. మోదీ నేతృత్వంలో 2047నాటికి భారత్ నంబర్ వన్‌గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్‌కు అందివచ్చిందని చంద్రబాబు అన్నారు. 

Tags :

మరిన్ని