Ramoji Rao: ఆపద్బాంధవుడు.. ఎందరినో ఆదుకున్న మహోన్నతుడు

ప్రకృతి కన్నెర్ర చేసినా.. కరోనా మహమ్మారి విరుచుకుపడినా ఆపత్కాలంలో అందరికంటే ముందే రామోజీరావు ముందడుగు వేసేవారు.

Published : 09 Jun 2024 13:05 IST

ప్రకృతి కన్నెర్ర చేసినా.. కరోనా మహమ్మారి విరుచుకుపడినా ఆపత్కాలంలో అందరికంటే ముందే రామోజీరావు ముందడుగు వేసేవారు. నలుగురికీ చేయూతనివ్వండి అని పిలుపునివ్వడం కంటే ముందు ఆయనే స్వయంగా సాయానికి పూనుకొనేవారు. తాను చేయూతనందించి నలుగుర్నీ భాగస్వాముల్ని చేసేవారు.  తుపానులు, వరదలు, భూకంపాల సమయంలో తక్షణమే విరాళాలు ప్రకటించి, ఈనాడు ద్వారా పెద్దఎత్తున విరాళాలు సేకరించి పేదలకు కూడు, గూడుకు భరోసా అందించారు. విద్యార్థులకు పాఠశాలలు నిర్మించి వారి చదువులకు అండగా నిలిచారు.

Tags :

మరిన్ని