Sri Sathya Sai Dist: తల్లిదండ్రుల మరణంతో రోడ్డున పడ్డ నలుగురు చిన్నారులు

శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలంలో తల్లిదండ్రుల అకాల మరణం ఆ నలుగురు చిన్నారులను రోడ్డున పడేసింది. అప్పటి వరకు తల్లిదండ్రుల చాటున పెరిగిన వారికి కూడు కూడా కష్టంగా మారింది. గుడిసె సైతం వానకు తడిసి కారిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు.

Published : 27 May 2024 16:14 IST

శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలంలో తల్లిదండ్రుల అకాల మరణం ఆ నలుగురు చిన్నారులను రోడ్డున పడేసింది. అప్పటి వరకు తల్లిదండ్రుల చాటున పెరిగిన వారికి కూడు కూడా కష్టంగా మారింది. గుడిసె సైతం వానకు తడిసి కారిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటున్నారు. కొత్త చెరువు వ్యవసాయ మార్కెట్ పక్కన తాత్కాలిక గుడిసెలో దంపతులు చౌడమ్మ-అంజి 20 ఏళ్లుగా నివాసం ఉండేవారు. ఇటీవల వారిద్దరూ మృతి చెందడంతో నలుగురు పిల్లలు అనాథలుగా మారారు. ఇరుగు పొరుగువారు పది రోజులుగా పిల్లలకు భోజనం పెట్టి ఆకలి తీరుస్తున్నారు. తమకు చదువుకోవాలని ఉందని ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని చిన్నారులు ప్రాధేయపడుతున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు