TS News: పంద్రాగస్టులోగా రుణమాఫీ చేయాల్సిందే: సీఎం రేవంత్

పంద్రాగస్టు నాటికి రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని స్పష్టంచేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు.

Published : 11 Jun 2024 09:49 IST

పంద్రాగస్టు నాటికి రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని స్పష్టంచేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. రుణమాఫీ అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. అన్నివాణిజ్య బ్యాంకులతోపాటు పీఏసీఎస్‌లలో తీసుకున్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రుణమాఫీ అమలు విధివిధానాల రూపకల్పనపై యంత్రాగం దృష్టిసారించింది.

Tags :

మరిన్ని