CM Revanth Reddy: రామోజీరావు వ్యక్తి కాదు, వ్యవస్థ: సీఎం రేవంత్ రెడ్డి

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రామోజీరావుతో తనకు ఉన్న అనుంబంధాన్ని.. ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ  శైలజ, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరితో పంచుకున్నారు.

Updated : 11 Jun 2024 22:36 IST

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, దివంగత రామోజీరావు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రామోజీరావుతో తనకు ఉన్న అనుంబంధాన్ని.. ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ  శైలజ, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరితో పంచుకున్నారు. రామోజీరావు వ్యక్తి కాదు, వ్యవస్థ అని.. ఆయనకు ప్రత్యామ్నాయం లేదని కొనియాడారు. రామోజీ చూపిన మార్గంలో వారి కుటుంబ సభ్యులు, సంస్థలు ప్రజల తరఫున నిలబడాలని ఆకాంక్షించారు. రామోజీ ఆలోచనా విధానాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు