Revanth Reddy: తిరుమల శ్రీవారి సేవలో సీఎం రేవంత్‌ కుటుంబం

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు.

Updated : 22 May 2024 12:04 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి సీఎం రేవంత్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం సత్రం, కల్యాణ మండపం నిర్మించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 

Tags :

మరిన్ని