CM Revanth: ప్రభుత్వ ఆదాయ పెంపు మార్గాలపై సమీక్షించిన సీఎం

రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు సవరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎక్కడెక్కడ, ఎంతమేరకు సవరించాలో శాస్త్రీయంగా నిర్ధారించాలని సీఎం తెలిపారు.

Published : 17 May 2024 10:21 IST

రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు సవరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎక్కడెక్కడ, ఎంతమేరకు సవరించాలో శాస్త్రీయంగా నిర్ధారించాలని సీఎం తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో స్టాంపు డ్యూటీపై అధ్యయనం చేసి పెంచాలా, తగ్గించాలా అనే నిర్ణయం తీసుకోవాలన్నారు. జీఎస్టీ ఎగవేగతపై కఠినంగా వ్యవహరించాలని ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గతేడాది ఆదాయం ఆశాజనకంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేసి రాబడులు పెంచాలని ఆదేశించారు.

Tags :

మరిన్ని