PM Modi: కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు పాక్ సానుభూతిపరులు: మోదీ
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ పార్టీ నేతలు పాకిస్థాన్ సానుభూతిపరులని ప్రధాని విమర్శించారు. ఆ రెండు పార్టీలూ పాకిస్థాన్ అణుశక్తిని చూసి భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు భారత్పై కన్నేసిన ఆ దేశంలో ఇప్పుడు ప్రజలు అన్నం కోసం అల్లాడే పరిస్థితులు ఏర్పడ్డాయని మోదీ ఎద్దేవా చేశారు.