CPI Narayana: చంద్రబాబు, నీతీశ్‌ లేకపోతే మోదీ ప్రధాని కావడం కష్టం: సీపీఐ నారాయణ

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ ఊహించని రీతిలో తెదేపా కూటమి విజయం సాధించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రజా పాలనను తుంగలో తొక్కి.. కేవలం సంక్షేమ పథకాల ద్వారానే విజయం సాధించవచ్చని ఊహలో ఉండటంతో నేడు ఓటమి పాలయ్యారని తెలిపారు.

Published : 05 Jun 2024 16:24 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ ఊహించని రీతిలో తెదేపా కూటమి విజయం సాధించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రజా పాలనను తుంగలో తొక్కి.. కేవలం సంక్షేమ పథకాల ద్వారానే విజయం సాధించవచ్చని ఊహలో ఉండటంతో నేడు ఓటమి పాలయ్యారని తెలిపారు. తెదేపా బలంతోనే ఏపీలో భాజపాకు సీట్లు వచ్చాయన్నారు. ఏపీలో కూటమి విజయం భాజపా ప్రభావం కాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనే హామీని కేంద్రం తుంగలో తొక్కిందని.. చంద్రబాబు రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంలో కొట్లాడాలని ఆయన సూచించారు. 

Tags :

మరిన్ని