CPI RK: ఏపీలో ఐదేళ్లపాటు పొలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు: సీపీఐ రామకృష్ణ

ఎన్నికల సమయంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీలో జిల్లా ఎస్పీలు, అధికారులు, అధికార పార్టీకి కొమ్ముకాయడం చూడలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Published : 18 May 2024 16:49 IST

ఎన్నికల సమయంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీలో జిల్లా ఎస్పీలు, అధికారులు, అధికార పార్టీకి కొమ్ముకాయడం చూడలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాజమహేంద్రవరంలో సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన ఐదేళ్లపాటు పొలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఇసుక దోపిడీలు, అవకతవకలపై కొత్త ప్రభుత్వం సమగ్రమైన విచారణ చేయాలని రామకృష్ణ కోరారు. జగన్‌కు సర్వే రిపోర్ట్స్‌ తెలుసని.. ఓటమి తప్పదనే కారణంతోనే లండన్ వెళ్లారని రామకృష్ణ ఆరోపించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు