Remal Cyclone: ‘రెమాల్‌’ బీభత్సం.. ఇద్దరు పిల్లలు సహా 14 మంది మృతి

రెమాల్‌ తుపాను ధాటికి ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మిజోరం రాజధాని ఆయిజోల్‌ నగర శివార్లలో మూడు దశాబ్దాలుగా వాడుకలో లేని ఒక రాళ్లక్వారీ మంగళవారం ఉదయం కుప్పకూలి, ఇద్దరు పిల్లలు సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated : 29 May 2024 12:07 IST

రెమాల్ తుపాను ఈశాన్య రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. భారీ వర్షాల కారణంగా మిజోరంలోని వేర్వేరు ప్రాంతాలలో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య 25కు చేరింది. అయిజోల్‌లో రాతి క్వారీ కూలి ఇద్దరు పిల్లలు సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది గల్లంతయ్యారు. అసోంలో చెట్లు, కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు