AP News: అడుగు ముందుకు పడని చింతపల్లి జెట్టీ నిర్మాణ పనులు

గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తానంటూ చింతపల్లి ఫ్లోటింగ్ జెట్టీ శంకుస్థాపన సమయంలో జగన్ చెప్పుకొచ్చారు. నాడు జగన్ చెప్పిన మాటలతో తమ జీవితాలు మారతాయని మత్స్యకారులు ఆశపడ్డారు. పునాదిరాయి వేసి సంవత్సరం గడిచినా సంబంధిత పనులు అడుగు ముందుకు పడకపోవడంతో నేడు ఆందోళన చెందుతున్నారు.

Published : 29 May 2024 12:29 IST

మాటలు చెప్పి పూట గడపటంలో జగన్‌కు మరెవరూ సాటిరారు. గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తా వారి అభ్యున్నతికి బాటలు వేస్తానంటూ చింతపల్లి ఫ్లోటింగ్  జెట్టీ శంకుస్థాపన సమయంలో జగన్ చెప్పుకొచ్చారు. పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికారు. నాడు జగన్ చెప్పిన మాటలతో తమ జీవితాలు మారతాయని మత్స్యకారులు ఆశపడ్డారు. పునాదిరాయి వేసి సంవత్సరం గడిచినా సంబంధిత పనులు అడుగు ముందుకు పడకపోవడంతో నేడు ఆందోళన చెందుతున్నారు. అన్ని వర్గాలతో పాటు తమనూ జగన్ నమ్మించి నట్టేట ముంచారని వాపోతున్నారు.

Tags :

మరిన్ని