Bhadrachalam: భద్రాచలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

వేసవి సెలవులు సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మూడు రోజుల నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. విద్యార్థులు, యువతీయువకులు వారి తల్లిదండ్రులతో కలిసి పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు.

Published : 20 May 2024 13:59 IST

వేసవి సెలవులు సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మూడు రోజుల నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. విద్యార్థులు, యువతీయువకులు వారి తల్లిదండ్రులతో కలిసి పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సీతారాముల దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎండల దృష్ట్యా ఆలయ అధికారులు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ఉచిత దర్శనం క్యూలైన్ల వద్ద చల్లటి మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు కొండపైకి రావడానికి నూతనంగా షెడ్లు నిర్మించారు.

Tags :

మరిన్ని