YS Jagan: జనాగ్రహానికి నేలకరిచిన నియంత!

పాలకులు ప్రజా సేవకులే తప్ప యజమానులు కాదు. ఆ వాస్తవాన్ని విస్మరించి, పాపిష్టి ఫాసిస్టులా మారిన జగన్ పీడను జనం వదిలించుకున్నారు. 

Published : 05 Jun 2024 10:51 IST

పాలకులు ప్రజా సేవకులే తప్ప యజమానులు కాదు. ఆ వాస్తవాన్ని విస్మరించి, పాపిష్టి ఫాసిస్టులా మారిన జగన్ పీడను జనం వదిలించుకున్నారు. స్వర్ణాంధ్రను శిథిలం చేసి, అన్ని వర్గాలనూ వెంటాడి వేధించిన జగన్మోసకారి వికృత వ్యక్తిత్వంపై పోటెత్తిన ప్రజాగ్రహమే- తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమికి 164 సీట్లను కట్టబెట్టింది. వైకాపా భ్రష్టపాలనపై మూడోకన్ను తెరిచిన జనసామాన్యం- రాష్ట్రాన్ని పునర్నిర్మించే గురుతర బాధ్యతలను కూటమి నేతల చేతుల్లో పెట్టింది.

Tags :

మరిన్ని