Guntur: వైకాపా నేతల నుంచి నా కుటుంబానికి ప్రాణహాని: సుధాకర్‌

వైకాపా నేతల నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని గొట్టిముక్కల సుధాకర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తెనాలిలో తమ ఇంటి వద్ద సంచరిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై సుధాకర్‌ శుక్రవారం గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు.

Published : 17 May 2024 16:42 IST

వైకాపా నేతల నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని గొట్టిముక్కల సుధాకర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తెనాలిలో తమ ఇంటి వద్ద సంచరిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై సుధాకర్‌ శుక్రవారం గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు. కోర్టు ఆదేశాల మేరకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఈనెల 13న క్యూలో వచ్చి ఓటేయాలని చెప్పినందుకు సుధాకర్‌ అనే ఓటరుపై వైకాపా ఎమ్మెల్యే శివకుమార్‌, అతని అనుచరులు విచక్షణా రహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు