IND vs CHINA: టగ్‌ ఆఫ్‌ వార్‌.. చైనా సైనికులపై ఇండియన్‌ ఆర్మీదే పైచేయి!

భారత్, చైనా సైన్యం సూడాన్‌లో సరదాగా ఆడిన ‘టగ్  ఆఫ్ వార్’కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆటలో భారత్ విజయం సాధించగా.. మన దేశ సైన్యం ప్రదర్శన ముందు డ్రాగన్ సైనికులు తేలిపోయారు.

Published : 29 May 2024 18:39 IST

భారత్, చైనా సైన్యం సూడాన్‌లో సరదాగా ఆడిన ‘టగ్  ఆఫ్ వార్’కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆటలో భారత్ విజయం సాధించగా.. మన దేశ సైన్యం ప్రదర్శన ముందు డ్రాగన్ సైనికులు తేలిపోయారు. సూడాన్‌లో శాంతి పరిరక్షణ నిమిత్తం వెళ్లిన భారత్, చైనా సైనికులు స్నేహపూర్వకంగా టగ్ ఆఫ్ వార్‌ను ఆడారు. అటు ఐరాస అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మేజర్ రాధిక సేన్‌కు యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వొకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటర్రస్ ప్రదానం చేశారు.

Tags :

మరిన్ని