దేశంలోనే అరుదైన కళల్లో ఒకటైన కరీంనగర్ ఫిలిగ్రీకి మరో గుర్తింపు లభించింది. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ, నీతా దంపతుల కుమారుడు అనంత్ అంబానీ వివాహం సందర్భంగా దేశవిదేశాలకు చెందిన అతిథులకు బహుమతులుగా ఇచ్చేందుకు ఫిలిగ్రీ కళాఖండాలను ఆర్డర్ చేసినట్లు కరీంనగర్ ఫిలిగ్రీ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు.