KTR: అకాల వర్షానికి చనిపోయిన కుటుంబాలకు కేటీఆర్‌ పరామర్శ

ఆదివారం కురిసిన అకాల వర్షానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం హాఫీజ్‌పేట్‌లో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలను భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పరామర్శించారు.

Published : 27 May 2024 19:23 IST

ఆదివారం కురిసిన అకాల వర్షానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం హాఫీజ్‌పేట్‌లో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలను భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు. వర్ష ప్రభావానికి రాష్ట్రవ్యాప్తంగా 14 మంది చనిపోయారని, వర్షాకాలం రాకముందే ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.  

Tags :

మరిన్ని