పోలింగ్‌ రోజు మాపై దాడి చేసింది వైకాపా మూకలే..!: కూచువారిపల్లి గ్రామస్థులు

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజు వైకాపా మూకలే తమ గ్రామంలోకి చొరబడి విచక్షణారహితంగా తమపై దాడి చేశారని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థులు ఆరోపించారు.

Updated : 19 May 2024 16:17 IST

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజు వైకాపా మూకలే తమ గ్రామంలోకి చొరబడి విచక్షణారహితంగా తమపై దాడి చేశారని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థులు చెబుతున్నారు. తెలుగుదేశం సానుభూతిపరులమనే.. మోహిత్ రెడ్డి తన అనుచరులతో కలిసి తమపై దాడికి దిగారని గ్రామస్థుడు మురళీధర్‌ ఆరోపించారు. కానీ దాడి చేసిన వైకాపా మూకలపై కాకుండా తెలుగుదేశం శ్రేణులపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. పూర్తిస్థాయి ఆధారాలు సిట్‌కి ఇస్తామన్న అతడు.. వివరాలను పరిశీలించి అసలైన నిందితులని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Tags :

మరిన్ని