TS News: ఆక్రమణకు గురైన దేవాలయ భూముల స్వాధీనంపై చర్యలు: మంత్రి కొండా సురేఖ

తెలంగాణలోని దేవాలయాలకు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.

Published : 22 May 2024 10:09 IST

తెలంగాణలోని దేవాలయాలకు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో అధికారులతో మంత్రి కొండా సురేఖ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఆక్రమణకు గురైన దేవాలయ భూములను స్వాధీనం చేసుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్న మంత్రి.. ధరణిలో నమోదు చేసి దేవాలయం పేరిట పాస్‌బుక్ జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 

Tags :

మరిన్ని