AP News: ఏపీ నూతన సీఎస్‌గా నీరభ్‌కుమార్ బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్‌కుమార్ ప్రసాద్ రాష్ట్ర సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Published : 07 Jun 2024 14:59 IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్‌కుమార్ ప్రసాద్ రాష్ట్ర సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. తితిదే, విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామీ దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్‌ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పీసీసీఎఫ్ వై.మధుసూదన్ రెడ్డి, ఐటీ కార్యదర్శి కె.శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్ తదితరులు హాజరయ్యారు. 

Tags :

మరిన్ని