Prashant Kishore: కేంద్రంలో మళ్లీ వచ్చేది భాజపానే!: ప్రశాంత్‌ కిశోర్‌

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా గతసారి ఫలితాలనే చవిచూస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ వ్యాఖ్యానించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 21 May 2024 21:46 IST

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా గతసారి ఫలితాలనే చవిచూస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ వ్యాఖ్యానించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై ప్రజలకు నిరాశ ఉన్నప్పటికీ.. ఎక్కువగా కోపం మాత్రం లేదని పేర్కొన్నారు. ఒక వేళ భాజపాకు నష్టం జరిగితే.. అది ఉత్తర, పశ్చిమ భారతంలో మాత్రమే జరుగుతుందనీ, దక్షిణాదిన కాదని వివరించారు. ‘చార్‌ సౌ పార్‌’ వినాదంతో గెలుపోటముల చర్చ కేంద్రకాన్ని మార్చిన క్రెడిట్‌ మోదీకే చెల్లుతుందన్నారు. పీకే ఇంటర్వ్యూ ఓ స్పాన్సర్డ్‌ షో అనీ, ఆయన రాజకీయ విశ్లేషకుడి ముసుగులో ఉన్న ఆరెస్సెస్‌ మనిషని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు