Bhadrachalam: నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. బంధువుల ఆందోళన

భద్రాచలంలోని పారా మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం కళాశాల వద్ద అపస్మారకస్థితిలో పడిపోయిన నర్సింగ్ విద్యార్థిని కారుణ్య.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

Published : 24 May 2024 12:26 IST

భద్రాచలంలోని పారా మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం కళాశాల వద్ద అపస్మారకస్థితిలో పడిపోయిన నర్సింగ్ విద్యార్థిని కారుణ్య.. చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమె బంధువులు కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాసుపత్రి నుంచి ర్యాలీగా కళాశాల వద్దకు వచ్చారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కళాశాలకు వచ్చిన ఛైర్మన్‌పై దాడికి విద్యార్థులు, బంధువులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.  

Tags :

మరిన్ని