PAYTM: రూ.550కోట్ల నష్టాల్లో పేటీఎం..!

పేటీఎం బ్రాండ్ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక సేవల సంస్థ ‘వన్ 97 కమ్యూనికేషన్స్’ నష్టం మరింత పెరిగింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో వన్ 97 కంపెనీ నష్టాలు రూ.550 కోట్లుగా నమోదయ్యాయి.

Published : 22 May 2024 15:16 IST

పేటీఎం బ్రాండ్ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్థిక సేవల సంస్థ ‘వన్ 97 కమ్యూనికేషన్స్’ నష్టం మరింత పెరిగింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో వన్ 97 కంపెనీ నష్టాలు రూ.550 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే మూడు నెలల వ్యవధిలో పేటీఎం రూ.167 కోట్ల నష్టాన్ని నివేదించింది. పేటీఎం కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం జనవరి-మార్చి త్రైమాసికంలో 2.8 శాతం కుంగి.. 2,267 కోట్లుగా నమోదైంది. మొత్తంగా 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టం వార్షిక ప్రాతిపదికన రూ.1,776 కోట్ల నుంచి రూ.1,422 కోట్లకు తగ్గింది. ఆదాయం 25 శాతం పెరిగి.. రూ.9,978 కోట్లకు చేరింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌లలోకి డిపాజిట్లు, టాపప్‌లు సహా ఎలాంటి క్రెడిట్ లావాదేవీలు నిర్వహించొద్దని ఆదేశించింది. ఈ అంక్షలతో రూ.500 కోట్ల నష్టం వాటిల్లుతుందని పేటీఎం అప్పట్లో అంచనా వేసింది.

Tags :

మరిన్ని