AP News: ఒక్కొక్కటిగా బయటపడుతోన్న వైకాపా అరాచకాలు

పల్నాడు జిల్లాలో ఐదేళ్ల వైకాపా పాలనలో సాగిన అరాచకాలు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజూ కొనసాగాయి. జిల్లాలో మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలూ అధికార పార్టీ వారే కావడంతో ఐదేళ్లలో అధికార యంత్రాంగం మొత్తం వారి కనుసన్నల్లోనే నడిచింది.

Published : 24 May 2024 12:43 IST

పల్నాడు జిల్లాలో ఐదేళ్ల వైకాపా పాలనలో సాగిన అరాచకాలు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజూ కొనసాగాయి. జిల్లాలో మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలూ అధికార పార్టీ వారే కావడంతో ఐదేళ్లలో అధికార యంత్రాంగం మొత్తం వారి కనుసన్నల్లోనే నడిచింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేటులో ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బైటకు రావడం, పిన్నెల్లి సోదరులు పరారు కావడంతో పోలింగ్ నాటి అరాచకాల వీడియోలను కొందరు ధైర్యంగా సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. పల్నాడులో వైకాపా నేతల అరాచకాలు ఈ స్థాయిలో జరిగాయా అని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని