Pinnelli: హైకోర్టు విధించిన షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారు

ఈవీఎం ధ్వంసం కేసులో పోలీసులు అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు ఆ సమయంలో విధించిన షరతులను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉల్లంఘించారని పీపీ కోర్టుకు నివేదించారు. ఫలితంగా ఆయన కదలికలపై పోలీసులు నిఘా ఉంచలేకపోయారని చెప్పారు. 

Updated : 27 May 2024 12:46 IST

ఈవీఎం ధ్వంసం కేసులో పోలీసులు అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు.. ఆ సమయంలో విధించిన షరతులను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉల్లంఘించారని హైకోర్టుకు పీపీ నివేదించారు. ఫలితంగా ఆయన కదలికలపై పోలీసులు నిఘా ఉంచలేకపోయారని చెప్పారు. అందువల్ల మరో మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ పొందేందుకు పిటిషనర్ అనర్హుడని పీపీ స్పష్టం చేశారు. అయితే వాదనలకు సమయం సరిపోకపోవడంతో హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Tags :

మరిన్ని