Polavaram: పరిహారం రాక.. పోలవరం నిర్వాసితుడి ఆత్మహత్యాయత్నం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆస్తులు త్యాగం చేసినా.. ఆయన్ను ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి అధికారులు అనర్హుడిగా తేల్చారు. తాను ఏం పాపం చేశానంటూ కార్యాలయాల చుట్టూ తిరిగినా.. జగన్‌ ప్రభుత్వ హయాంలో న్యాయం జరగలేదు.

Published : 25 May 2024 13:21 IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆస్తులు త్యాగం చేసినా.. ఆయన్ను ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి అధికారులు అనర్హుడిగా తేల్చారు. తాను ఏం పాపం చేశానంటూ కార్యాలయాల చుట్టూ తిరిగినా.. జగన్‌ ప్రభుత్వ హయాంలో న్యాయం జరగలేదు. విసిగిపోయిన ఆ వృద్ధ రైతు శుక్రవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారి కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. తరువాత అక్కడే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు