AP News: ఎన్నికల వేళ హింస.. జైళ్లలో కార్యకర్తలు.. దర్జాగా నాయకులు!

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజున, ఆ తర్వాత జరిగిన వరుస అల్లర్లలో ఎందరో సామాన్యులు బలయ్యారు.

Published : 28 May 2024 11:06 IST

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజున, ఆ తర్వాత జరిగిన వరుస అల్లర్లలో ఎందరో సామాన్యులు బలయ్యారు. తమ నాయకుడి కోసమో, పార్టీపై అభిమానంతోనో వారి అనుచరులు, కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీల నేతలపై, అనుచరులపై దాడులకు దిగారు. కొన్నిచోట్ల ప్రత్యర్థి పార్టీల దాడుల నుంచి తమని తాము కాపాడుకునేందుకు ఆత్మరక్షణ కోసం ప్రతిదాడులు చేశారు. ఫలితంగా తీవ్రమైన అభియోగాలతో నమోదైన కేసుల్లో వారంతా ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నారు. ఆయా ఘటనల్లో అనుచరులను, కార్యకర్తలను పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ప్రభావితం చేసిన నేతలు మాత్రం న్యాయస్థానాలను ఆశ్రయించి ఖరీదైన లాయర్లతో వాదనలు వినిపించి దర్జాగా బయట తిరుగుతున్నారు. 

Tags :

మరిన్ని