AP Elections 2024: ఓట్ల లెక్కింపు.. ప్రతి అరగంటకు ఒక రౌండ్‌ ఫలితం

జూన్ 4న ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

Published : 30 May 2024 09:23 IST

జూన్ 4న ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయగా ఒక్కో రౌండ్ లెక్కింపునకు గరిష్ఠంగా 30 నిమిషాల సమయం పట్టనుంది. తొలుత సైనికదళాల్లో పనిచేసే వారి ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభంకానుంది. 11 గంటల కల్లా ఫలితాలపై స్పష్టత రానుండగా మధ్యాహ్నానికి తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

Tags :

మరిన్ని