SP Charan: ‘పాడుతా తీయగా’ ఇంకా కొనసాగుతోందంటే రామోజీనే కారణం: ఎస్పీ చరణ్‌

ఎంతో మందికి నీడగా, అండగా ఉన్న రామోజీరావు (Ramoji Rao) మరణించడం బాధాకరమని సినీ గాయకుడు ఎస్పీ చరణ్‌ అన్నారు.

Published : 08 Jun 2024 16:19 IST

ఎంతో మందికి నీడగా, అండగా ఉన్న రామోజీరావు (Ramoji Rao) మరణించడం బాధాకరమని సినీ గాయకుడు ఎస్పీ చరణ్‌ అన్నారు. రామోజీ పార్థివదేహానికి ఆయన నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘నాన్నను (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) ఎంతగానో ఆదరించిన వ్యక్తి రామోజీరావు. నాన్న ఉన్నప్పుడు పట్టుబట్టి పాడుతా తీయగా కార్యక్రమాన్ని రామోజీరావు చేపట్టారు. నాన్న తదనంతరం కూడా ఆ కార్యక్రమం ఇంకా కొనసాగుతోందంటే దానికి కారణం రామోజీరావు’ అని ఎస్పీ చరణ్‌ చెప్పారు. 

Tags :

మరిన్ని