TDP: ప్రకాశం జిల్లాలో తెదేపా నాయకుడి కారుకు నిప్పు

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాలెంలో తెదేపాకి చెందిన నాయకుడి కారును దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారు.

Published : 25 May 2024 11:29 IST

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాలెంలో తెదేపాకి చెందిన నాయకుడి కారును దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. చిగురుపాటి శేషగిరి ఇంటి వద్ద నిలిపి ఉన్న కారును అర్ధరాత్రి సమయంలో పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. వెంటనే ఆయన పోలీసులకు పిర్యాదు చేశారు. తెదేపా నేత అయిన శేషగిరి.. లారీ యజమానుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై కొండపి ఎమ్మెల్యే డోల వీరాంజనేయ స్వామి ఎస్పీకి ఫోన్ చేసి రాజకీయ కోణంలోనూ దర్యాప్తు నిర్వహించాలని కోరారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు