Siddipet: కన్నవారికి ఆలయం.. తల్లిదండ్రులపై కుమారుల ప్రేమ

కాలం చేసిన తమ కన్నవారికి ఆ కుమారులు గుడి కట్టి ఆదర్శంగా నిలిచారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు చెందిన గొట్టె కనకయ్య, కొమురవ్వ దంపతుల కుమారులు.. చనిపోయిన తల్లిదండ్రులు నిత్యం తమ కళ్ల ముందే కనిపించాలనుకున్నారు. తమ వ్యవసాయ భూమిలో గుడి నిర్మించి, విగ్రహాలను ప్రతిష్ఠించారు.

Published : 25 May 2024 17:52 IST

కాలం చేసిన తమ కన్నవారికి ఆ కుమారులు గుడి కట్టి ఆదర్శంగా నిలిచారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు చెందిన గొట్టె కనకయ్య, కొమురవ్వ దంపతులకు సదయ్య, మహేందర్, చిరంజీవి సంతానం. సదయ్య, మహేందర్‌ వ్యవసాయం చేస్తుండగా.. చిరంజీవి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. నాలుగేళ్ల క్రితం తల్లి అనారోగ్యంతో, ఏడాది క్రితం తండ్రి పాముకాటుతో కన్నుమూశారు. అమ్మానాన్నలిద్దరూ దూరమవడాన్ని కుమారులు జీర్ణించుకోలేకపోయారు. వారు నిత్యం తమ కళ్లముందు ఉండేలా తమ వ్యవసాయ భూమిలో గుడి నిర్మించి, విగ్రహాలను ప్రతిష్ఠించారు. శుక్రవారం తండ్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ విగ్రహాలను ఆవిష్కరించి పూజలు చేశారు.

Tags :

మరిన్ని