SC Railway: గుంటూరు-సికింద్రాబాద్‌ మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

గుంటూరు-సికింద్రాబాద్‌ మార్గంలో నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తోన్న గూడ్స్‌ రైలు పక్కకు ఒరిగిపోవడంతో రెండు బోగీలు పట్టాలు తప్పాయి.

Published : 26 May 2024 19:00 IST

గుంటూరు-సికింద్రాబాద్‌ మార్గంలో నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తోన్న గూడ్స్‌ రైలు పక్కకు ఒరిగిపోవడంతో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఆ సమయంలో రైలు తక్కువ స్పీడ్‌లో ఉండటంతో డ్రైవర్‌ చాకచక్యంగా బ్రేక్‌లు వేసి మిగతా బోగీలు పడిపోకుండా జగ్రత్తపడ్డారు. దీంతో గుంటూరు - సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా తిరుగుతున్నాయి.

Tags :

మరిన్ని