Venkaiah Naidu: రామోజీరావు పార్థివదేహానికి వెంకయ్యనాయుడు నివాళులు

రామోజీరావు (Ramoji Rao) స్వయంకృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. రామోజీ పార్థివదేహానికి వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు. 

Published : 08 Jun 2024 14:00 IST

రామోజీరావు (Ramoji Rao) స్వయంకృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. రామోజీ పార్థివదేహానికి వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘‘ఒక అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయింది. రామోజీరావు వ్యక్తి కాదు. శక్తిమంతమైన వ్యవస్థ. స్వయంకృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించారు. ఒక ధ్రువతారలా నిరంతరం వెలుగుతూ ఉంటారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకు ఆదర్శం. రామోజీరావు ఒక పోరాట యోధుడు’’ అని వెంకయ్యనాయుడు కొనియాడారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు