Nandigam Suresh: వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ పీఏ వీరంగం

అమరావతి మండలం లేమల్లెలో వైకాపాకు చెందిన మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ పీఏ లక్ష్మణ్‌ వీరంగం సృష్టించాడు.

Updated : 05 Jun 2024 17:52 IST

పల్నాడు జిల్లా అమరావతి మండలం లేమల్లెలో వైకాపాకు చెందిన మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ పీఏ లక్ష్మణ్‌ వీరంగం సృష్టించాడు. అక్రమ ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్థులను లారీతో తొక్కిస్తానంటూ బెదిరించాడు. లేమల్లె రియల్‌ ఎస్టేట్‌ స్థలాల్లో నందిగం సురేశ్‌ అనుచరులు అక్రమంగా ఇసుక డంపింగ్‌ చేశారు. రాత్రికి రాత్రే ఇసుక తరలింపునకు యత్నించడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. లారీలు వదిలిపెట్టిన సిబ్బందిని స్థానికులు గ్రామంలో ఉంచారు. అక్కడికి వచ్చిన లక్ష్మణ్‌.. తమను ఎవరూ ఆపలేరంటూ లారీలను తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.

Tags :

మరిన్ని