CM Revanth: ఫోన్‌ ట్యాపింగ్‌పై భారాస సీబీఐ విచారణ కోరదా?: సీఎం రేవంత్‌

అన్ని విషయాల్లో సీబీఐ అనే కేటీఆర్, హరీశ్‌రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాత్రం సీబీఐ విచారణ కోరరా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanthreddy) ప్రశ్నించారు.

Published : 28 May 2024 16:28 IST

అన్ని విషయాల్లో సీబీఐ అనే కేటీఆర్, హరీశ్‌రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాత్రం సీబీఐ విచారణ కోరరా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanthreddy) ప్రశ్నించారు. అధికార మార్పిడి సమయంలో ఎస్‌ఐబీ కార్యాలయంలో పరిణామాలతో ట్యాపింగ్ వ్యవహారం బయటికి వచ్చిందన్న సీఎం.. 1980, 1990ల నుంచి సేకరించిన డేటా అంతా ఉందో లేదో దర్యాప్తు అధికారులే తేల్చాల్సిందన్నారు. కాళేశ్వరం విషయంలో నిపుణుల సూచనల మేరకే ముందుకెళ్తామన్న సీఎం.. తెలంగాణ త్యాగాలు, పోరాటాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని చెప్పారు.

Tags :

మరిన్ని