AP News: రూ.100 కోట్ల విలువైన మాన్సాస్‌ భూములు కొట్టేసేందుకు ప్రయత్నాలు

విజయనగరం పరిధిలోని దాదాపు రూ.100 కోట్ల విలువైన దేవాదాయ భూములపై కన్నేసి.. దాన్ని అధికారపార్టీ నేతల సహకారంతో సొంతం చేసుకోవాలని కొందరు చూస్తున్నారు.

Published : 29 May 2024 09:31 IST

ఉత్తరాంధ్రలో విలువైన భూములపై కన్నేసిన వైకాపా పెద్దలు ఎన్నికల హడావుడిలో కొంత తగ్గుముఖం పట్టినా మళ్లీ పావులు కదుపుతున్నారు. దాదాపు వందకోట్ల విలువైన మాన్సాస్ భూమి కొట్టేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నిషేధిత జాబితా నుంచి ఈ భూమిని తొలగించాలంటూ రెండేళ్ల క్రితమే అర్జీ పెట్టగా అప్పటి దేవాదాయ కమిషనర్ తిరస్కరించారు. ఫిబ్రవరిలో మరోసారి అప్పీలు చేయగా ఎన్‌వోసీ ఇచ్చేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Tags :

మరిన్ని