Vizag: బర్మాకాలనీ దాడి కేసును నీరుగార్చేందుకు పోలీసుల యత్నం

వైకాపాకు ఓటేయలేదన్న కారణంతో ఆ పార్టీకి చెందిన అరాచక శక్తులు.. విశాఖలోని బర్మాకాలనీలో ఒక కుటుంబంపై పాశవికంగా దాడి చేశాయి. దాన్నో కుటుంబ తగాదాగా చిత్రీకరించి పోలీసులు కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. 

Published : 21 May 2024 09:49 IST

ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయలేదని సామాన్యులపై దాడులకు చేయడాన్ని ఇప్పటివరకు ఫ్యాక్షన్ ప్రభావితమైన ప్రాంతాల్లో మాత్రమే చూసేవాళ్లం. వైకాపా నేతల వల్ల ఈ సంస్కృతి ప్రశాంతతకు మారుపేరైనా ఉత్తరాంధ్రకి పాకింది. వైకాపాకి ఓటేయలేదని ఆ పార్టీ నాయకులు విశాఖలోని బర్మా కాలనీలో ఒక కుటుంబంపై దాడి చేశారు. ఉక్కుపాదంతో అణచివేయాల్సిన పోలీసులు.. దాన్నో కుటుంబ తగాదాగా చిత్రీకరించి, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనల్ని సిట్ దర్యాప్తు పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Tags :

మరిన్ని