Guntur: చేబ్రోలులో తీవ్ర కలకలం.. అతిసారం ప్రబలి 100 మందికి పైగా అస్వస్థత

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలోని ఓ వీధిలో నివాసముంటున్న వారంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురవటం తీవ్ర కలకలం రేపింది.

Updated : 19 Apr 2024 14:36 IST

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాలలోని ఓ వీధిలో నివాసముంటున్న వారంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురవటం తీవ్ర కలకలం రేపింది. జ్వరం, వాంతులు, విరోచనాలతో బాధపడుతూ100 మందికి పైగా మంచం పట్టారు. వీధిలోని ఇంటికొకరు మంచం పట్టటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. రెండు రోజులుగా సమస్యలతో బాధపడుతున్నా వైద్యాధికారులు గ్రామానికి రావటం లేదని స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు