Parvathipuram: 65 గ్రామాల్లో దాహం కేకలు.. అల్లాడుతున్న పార్వతీపురం మన్యం ప్రజలు
వేసవి రాక ముందే పార్వతీపురం మన్యం జిల్లా వాసులు దాహార్తితో అల్లాడుతున్నారు. సువర్ణముఖి నదిలోని ఇన్ ఫిల్టర్ బావుల్లో మోటార్లు మరమ్మతులకు గురవడంతో సుమారు 65 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఏటా ఇదే సమస్య పునరావృతమవుతున్నా అధికారులు శాశ్వత పరిష్కారం దిశగా దృష్టి సారించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated : 12 Feb 2024 18:51 IST
Tags :