Jairam Ramesh: ఏపీ, బిహార్‌కు ప్రత్యేక హోదా ఇప్పుడైనా ఇస్తారా?: జైరాం రమేశ్‌

ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన ప్రత్యేకహోదా హామీకి సంబంధించి.. కేంద్రంపై కాంగ్రెస్ ఎదురుదాడి పెంచింది.

Published : 06 Jun 2024 17:47 IST

ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన ప్రత్యేకహోదా హామీకి సంబంధించి.. కేంద్రంపై కాంగ్రెస్ ఎదురుదాడి పెంచింది. పదేళ్లక్రితం ఇచ్చిన హామీని ప్రధాని మోదీ ఇప్పుడైనా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మూడోవంతు ప్రధానికి.. ఏపీ, బిహార్‌కు సంబంధించి 4ప్రశ్నలు వేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్.. ఎక్స్‌లో ఓ వీడియో సందేశం పోస్టు చేశారు. 2014 ఏప్రిల్ 30న తిరుపతిలో ఏపీకి ప్రత్యేకహోదా కల్పిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, దానివల్ల పెద్దఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పదేళ్లయినా ఆ హామీ కార్యరూపం దాల్చలేదని జైరాం రమేశ్ విమర్శించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు