AP News: ఎన్నికల వేళ రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం

మద్యనిషేధం చేసి కానీ 2024 ఎన్నికల్లో ఓట్లు అడగనని ఊదరగొట్టిన సీఎం జగన్ సభల్లోనే మందుబాబులు తాగితూగుతున్నారు.

Published : 20 Apr 2024 09:25 IST

మద్యనిషేధం చేసి కానీ 2024 ఎన్నికల్లో ఓట్లు అడగనని ఊదరగొట్టిన సీఎం జగన్ (CM Jagan) సభల్లోనే మందుబాబులు తాగితూగుతున్నారు. వైకాపా నాయకులే మద్యం సీసాలు పంచి మరీ సభలకు తరలిస్తున్నారు. ఎన్నికల షెడ్యూలుకు ముందే భారీగా నిల్వ చేసుకున్న అధికార పార్టీ నాయకులు ఇప్పటికీ పొరుగు రాష్ట్రాల నుంచి సరకు తెప్పిస్తూనే ఉన్నారు. నామినేషన్ల పర్వం మొదలవగానే మద్యం పంపిణీని ముమ్మరం చేశారు. ఎన్నికల వేళ తనిఖీల్లో ఇటుక బట్టీలు, గోదాములు, ఇతర స్థావరాల్లో డంప్‌లు భారీగా వెలుగుచూస్తున్నాయి. ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టితో దాడి చేస్తే ఇంకా భారీగా బయటపడే అవకాశముంది.

Tags :

మరిన్ని