YS Sharmila: కర్నూలును స్మార్ట్‌సిటీ చేస్తానన్న జగన్‌.. మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు: వైఎస్‌ షర్మిల

న్యాయ రాజధాని పేరుతో కర్నూలు ప్రజలను జగన్ వంచించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 21 Apr 2024 16:43 IST

న్యాయ రాజధాని పేరుతో కర్నూలు ప్రజలను జగన్ వంచించారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ న్యాయ యాత్ర పర్యటనలో భాగంగా షర్మిల కర్నూలులో పర్యటించారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామని చెప్పిన జగన్‌.. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదని.. గుండ్రేవుల పూర్తయి ఉంటే కర్నూలువాసులకు నీళ్లు వచ్చేవన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసి రోడ్డున పడేశారని మండిపడ్డారు.  

Tags :

మరిన్ని