Sharmila: జగన్‌ అధికార దుర్వినియోగం చేసి హంతకులను కాపాడుతున్నారు: షర్మిల

వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ ఛార్జిషీట్‌లో చెప్పిన విషయాలను తాము మాట్లాడుతుంటే.. భావప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా వైకాపా నాయకులు కోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్.షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 20 Apr 2024 15:35 IST

వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ ఛార్జిషీట్‌లో చెప్పిన విషయాలను తాము మాట్లాడుతుంటే.. భావప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా వైకాపా నాయకులు కోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్.షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు చిన్నరాయి తగిలితేనే హత్యాయత్నం అని చెప్పిన వారు.. ఐదేళ్ల కిందట వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపితే ఎందుకు గుండెపోటేగా ప్రచారం చేశారో జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి మళ్లీ ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారో జగన్ సమాధానం చెప్పాలన్నారు. కడప పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల నామినేషన్ దాఖలు చేశారు.

Tags :

మరిన్ని